ఏసీబీలో ముగ్గురు అధికారులకు సేవా పతకాలు

ABN , First Publish Date - 2021-05-08T05:43:41+05:30 IST

అవినీతి నిరోధక శాఖలో పని చేస్తున్న ముగ్గురు అధికారులకు సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది.

ఏసీబీలో ముగ్గురు అధికారులకు సేవా పతకాలు

గుంటూరు, మే 7: అవినీతి నిరోధక శాఖలో పని చేస్తున్న ముగ్గురు అధికారులకు సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఏసీబీ డీఎస్పీ టీవీవీ ప్రతాప్‌కుమార్‌ను సేవా పతకానికి ఎంపిక చేసింది. అదే విధంగా ఏసీబీ ఎస్‌ఐ వి.శ్రీనివాసమూర్తికి మహోన్నత సేవాపతకం లభించింది. హెడ్‌ కానిస్టేబుల్‌ బి.శ్రీనివాసరావుకు సేవా పతకం ప్రకటించింది. వీరికి వచ్చే ఆగస్టు 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయా పతకాలను అందించనున్నారు. ఏసీబీలో ముగ్గురికి ఆయా సేవా పతకాలు లభించటం పట్ల ఏసీబీ అదనపు ఎస్పీ సురేష్‌బాబు అభినందించారు.  

Updated Date - 2021-05-08T05:43:41+05:30 IST