సింగపూర్‌లో 250 మంది భారతీయులకు కరోనా!

ABN , First Publish Date - 2020-04-10T23:51:52+05:30 IST

సింగపూర్‌లో ఉంటున్న దాదాపు 250 మంది భారతీయులు కరోనా బారినపడ్డట్లు ఇండియన్ హైకమిషన్ ప్రకటించింది. విదేశీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహా

సింగపూర్‌లో 250 మంది భారతీయులకు కరోనా!

న్యూఢిల్లీ: సింగపూర్‌లో ఉంటున్న దాదాపు 250 మంది భారతీయులు కరోనా బారినపడ్డట్లు ఇండియన్ హైకమిషన్ ప్రకటించింది. విదేశీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో ఉన్నవారే అత్యధికంగా కరోనా బారినపడ్డట్టు ఇండియన్ హైకమిషన్ అధికారి జావెద్ అష్రఫ్ తెలిపారు. ఈ 250 మందిలో కొందరు సింగపూర్‌‌లోనే స్థిరపడిన ప్రవాసులు కూడా ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు ఆయన వెల్లడించారు. కాగా.. వరల్డ్‌ఒమీటర్.ఇన్‌ఫో‌లోని సమాచారం ప్రకారం.. సింగపూర్‌లో ఇప్పటి వరకు దాదాపు 2000 కరోనా కేసులు నమోదయ్యాయి. సుమారు ఆరుగురు మరణించారు. ఇటు ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 96,791కి చేరింది. 


Updated Date - 2020-04-10T23:51:52+05:30 IST