మహారాష్ట్ర చికెన్‌

ABN , First Publish Date - 2015-08-31T21:40:59+05:30 IST

కావలసిన పదార్థాలు: చికెన్‌ - 200 గ్రా., అల్లంవెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, పచ్చిమిర్చి పేస్టు - అర టీ స్పూను

మహారాష్ట్ర చికెన్‌

కావలసిన పదార్థాలు: చికెన్‌ - 200 గ్రా., అల్లంవెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, పచ్చిమిర్చి పేస్టు - అర టీ స్పూను, ఎండు కొబ్బరి - 100 గ్రా., దనియాలు - 1 టీ స్పూను, ఎండు మిర్చి - 2, నువ్వులు అర టీ స్పూను, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, చిన్న ఉల్లిపాయ - 1, పసుపు - చిటికెడు, కారం - అర టేబుల్‌ స్పూను, పెరుగు - 1 టేబుల్‌ స్పూను, గరం మసాల - యాలకులు (2), దాల్చిన చెక్క (అంగుళం ముక్క), లవంగాలు ( 3), బిర్యాని ఆకు (1) , గోదా మసాల పొడి (మార్కెట్లో దొరుకుతుంది) - 1 టీ స్పూను, కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నీరు - ఒకటిన్నర కప్పు.
తయారుచేసే విధానం: చికెన్‌ ముక్కలకు సగం అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి ముద్దను పట్టించి అరగంట పక్కనుంచాలి. నూనెలో గరం మసాల దినుసులు, ఉల్లి తరుగు, మిగిలిన అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్టులు వేసి దోరగా వేగించాలి. ఇప్పుడు గోదా మసాల, ఉప్పు, కారం, పసుపులతో పాటు ముక్కలు వేయాలి. మసాలా ముక్కలకు పట్టిన తర్వాత నీరు కలిపి ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత కొబ్బరి, దనియాలు, ఎండుమిర్చి, నువ్వులను వేగించి గ్రైండ్‌ చేసిన పేస్టు కలపాలి. దించేముందు పెరుగు కలిపి చిటికెడు గోదా మసాల, కొత్తిమీర చల్లాలి. ఈ కర్రీ అన్నంతో మంచి కాంబినేషన్‌. 

Updated Date - 2015-08-31T21:40:59+05:30 IST