నువ్వులతో మటన్ కర్రీ
ABN , First Publish Date - 2017-12-02T16:53:55+05:30 IST
మటన్(చిన్న ముక్కలు)-కిలో, అల్లం పేస్టు- ఒక టేబుల్స్పూను, వెల్లుల్లి పేస్టు- ఒకటిన్నర టేబుల్స్పూను, ఉప్పు-ఒక టీస్పూను, బెల్లం (తరుగు), గసగసాలు- ఒక్కో టేబుల్స్పూను చొప్పున, లవంగాలు-8, గ్రీన్ యాలకులు-ఆరు, సోంపు-రెండు టీస్పూన్లు,
- అల్లం, వెల్లుల్లి పేస్టు, బెల్లం తరుగు, ఉప్పులను ఒక గిన్నెలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మటన్కు పట్టించి గంటపాటు నానబెట్టాలి.
- గసగసాలు, వెల్లుల్లి, యాలకులు, సోంపు, దాల్చినచెక్కలను తవా మీద కాసేపు వేగించి గ్రైండ్ చేయాలి.
- లోతైన కళాయిలో నూనె వేడి చేసి ఆవాలు, ఎండుమిర్చి వేగించాలి. తరువాత మటన్ వేసి బంగారు రంగులోకి వచ్చే వరకూ వేగించాలి.
- మటన్ వేగాక కారం, పసుపు, అల్లం, గ్రైండ్ చేసిపెట్టుకున్న మసాలా వేసి కలపాలి.
- తర్వాత ఒక కప్పు నీళ్లు పోసి మూత పెట్టి గంటసేపు సన్నని మంటపై ఉడికించాలి.
- వేగించిన నువ్వులను మటన్ కర్రీపై చల్లి నిమ్మరసం కూడా వేసి కలపాలి.
- రెడీ అయిన మటన్ కర్రీ మీద కొత్తిమీర తరుగు చల్లి వేడి వేడిగా తింటే టేస్టీగా ఉంటుంది.