చింతచిగురు చేపల పులుసు

ABN , First Publish Date - 2019-05-04T20:00:03+05:30 IST

చేపలు - అరకేజీ, ఉల్లిపాయలు - రెండు, పచ్చి మిర్చి - నాలుగు, ఉప్పు - తగినంత, పసుపు

చింతచిగురు చేపల పులుసు

కావలసిన పదార్థాలు
 
చేపలు - అరకేజీ, ఉల్లిపాయలు - రెండు, పచ్చి మిర్చి - నాలుగు, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, కారం - టీస్పూన్‌, నూనె - సరిపడా, మెంతికూర - కట్ట, అల్లం వెల్లుల్లి పేస్టు - టీస్పూన్‌, చింతపండు - కొద్దిగా, చింతచిగురు - 200గ్రాములు, గరంమసాల - టీస్పూన్‌.
 
తయారుచేయు విధానం
 
పాన్‌ తీసుకొని నూనె వేసి కాస్త వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు వేసి వేగించాలి.
ఉల్లిపాయలు వేగిన తరువాత పచ్చిమిర్చి వేయాలి. ఇప్పుడు మెంతికూర వేసి కాసేపయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి, కలపాలి. తరువాత చేపలు వేసి బాగా కలియబెట్టుకోవాలి. అయిదు నిమిషాలు ఉడికిన తరువాత చింత పులుసు పోసి మరి కాసేపు ఉడికించాలి. తరువాత కారం వేయాలి. చివరగా చింతచిగురు వేసి ఇంకాసేపు ఉడికించాలి. గరంమసాల వేసి దింపుకోవాలి.

Updated Date - 2019-05-04T20:00:03+05:30 IST