పచ్చి బఠాణీ పలావ్‌

ABN , First Publish Date - 2019-07-13T20:45:30+05:30 IST

బాస్మతి బియ్యం - రెండుకప్పులు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర - ఒక టేబుల్‌ స్పూన్‌

పచ్చి బఠాణీ పలావ్‌

కావలసినవి
 
బాస్మతి బియ్యం - రెండుకప్పులు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర - ఒక టేబుల్‌ స్పూన్‌, అల్లం - చిన్నముక్క, పచ్చి బఠాణీ - రెండు కప్పులు, ధనియాల పొడి - రెండు టీస్పూన్లు, గరంమసాలా - ఒకటీస్పూన్‌, ఉప్పు - తగినంత, పసుపు - ఒక టీస్పూన్‌, నీళ్లు - సరిపడా.
 
తయారీవిధానం
 
బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి గంటపాటు నానబెట్టుకోవాలి. ఒక పాన్‌లో నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక జీలకర్ర, మెత్తగా దంచిన అల్లం వేయాలి. అల్లం బాగా వేగాక బియ్యం, పచ్చి బఠాణీ, గరంమసాలా, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి కలియబెట్టాలి.
కాసేపు వేగాక నాలుగు కప్పుల నీళ్లు పోసి, బియ్యం వేసి చిన్నమంటపై ఉడికించాలి.
అన్నం ఉడికిన తరువాత వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-07-13T20:45:30+05:30 IST