తందూరి మష్రూమ్స్‌

ABN , First Publish Date - 2015-08-30T21:26:39+05:30 IST

కావలసిన పదార్థాలు: మష్రూమ్స్‌ - 300 గ్రా., పాలు - అకప్పు, కార్న్‌ఫ్లోర్‌ - అర టీ స్పూను, ఎండిన మెంతి ఆకులు - అర టీ స్పూను, నూనె - 1 టీ స్పూను,

తందూరి మష్రూమ్స్‌

కావలసిన పదార్థాలు
 
మష్రూమ్స్‌ - 300 గ్రా., పాలు - అకప్పు, కార్న్‌ఫ్లోర్‌ - అర టీ స్పూను, ఎండిన మెంతి ఆకులు - అర టీ స్పూను, నూనె - 1 టీ స్పూను, ఉప్పు రుచికి తగినంత, ఎండుమిర్చి - 4, వెల్లుల్లి రెబ్బలు - 4, అల్లం - అంగుళం ముక్క, ధనియాలపొడి, జీలకర్ర పొడి - 1 టీ స్పూను చొప్పున
 
తయారుచేసే విధానం
 
ముందుగా మష్రూమ్స్‌ను రెండు భాగాలుగా కట్‌ చేసుకొని, శుభ్రపరిచి ఆరబెట్టాలి. పాలల్లో కార్న్‌ఫ్లోర్‌ కలిపి పక్కనుంచాలి. ఇప్పుడు నాన్‌స్టిక్‌ పాన్‌లో నూనె వేసి, ముందుగా నూరి పెట్టుకున్న ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, మెంతి ఆకుల్ని వేసి వేగించాలి. తర్వాత మష్రూమ్స్‌, కార్న్‌ఫ్లోర్‌ కలిపిన పాలు, ఉప్పుని వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. ధనియాల, జీరా పొడులను కూడా కలిపి ఒక నిమిషం తర్వాత దింపేయాలి. తందూరి మష్రూమ్స్‌ వేడిగా తింటే రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-08-30T21:26:39+05:30 IST