రైస్ ఖీర్
ABN , First Publish Date - 2015-10-28T15:47:22+05:30 IST
కావలసిన పదార్థాలు: బాసుమతి బియ్యం: కప్పు, చక్కెర: ముప్పావుకప్పు, పాలు: రెండు కప్పులు, కుంకుమ పువ్వు: కొద్దిగా
తయారీవిధానం: పాలల్లో కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకోవాలి. మందపాటి గిన్నెలో నెయ్యివేసి బాదం, జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో పాలు మరిగించి అందులో కడిగిపెట్టుకున్న బాసుమతీ బియ్యాన్ని వేసి ఉడికించాలి. అన్నం మెత్తగా అయిన తరువాత పంచదార అవసరం అనుకుంటే కొద్దిగా నీరు పోసి మరికొద్ది సేపు ఉడకనివ్వాలి. అన్నం పూర్తిగా మెత్తగా అయ్యే వరకూ వుంచి వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్, కుంకుమ పువ్వు జతచేయాలి. దించే ముందు యాలకుల పొడి చల్లుకొని మొత్తం ఒకసారి కలియబెట్టి దించేసుకోవాలి. తీపి ఎక్కువగా ఇష్టపడేవారు పంచదార ఎక్కువగా వేసుకోవచ్చు.