సీతాఫలం కలాఖండ్‌

ABN , First Publish Date - 2017-10-14T17:24:51+05:30 IST

పాలు- రెండు లీటర్లు, నిమ్మరసం, చక్కెర ఒక్కొక్కటి రెండు టీస్పూన్లు, ఏలకులు- అరకప్పు (పొడి చేయాలి), సీతాఫలంగుజ్జు- ఒక టీస్పూను, నెయ్యి- ఒక కప్పు, పిస్తాలు-అరకప్పు, బాదంపప్పులు-ఆరు.

సీతాఫలం కలాఖండ్‌

కావాలసినవి: పాలు- రెండు లీటర్లు, నిమ్మరసం, చక్కెర ఒక్కొక్కటి రెండు టీస్పూన్లు, ఏలకులు- అరకప్పు (పొడి చేయాలి), సీతాఫలంగుజ్జు- ఒక టీస్పూను, నెయ్యి- ఒక కప్పు, పిస్తాలు-అరకప్పు, బాదంపప్పులు-ఆరు.
 
తయారీ: రెండు ప్యాన్లు తీసుకుని ఒక్కొక్కదానిలో ఒక్కొక్క లీటరు పాలు పోయాలి. ఒక ప్యానులోని పాలు సగానికి వచ్చే దాకా బాగా మరగనివ్వాలి. ఇంకో ప్యాన్లో ఉన్న పాలను కూడా వేడిచేయాలి. ఈ పాలు మరిగేటప్పుడు మంటను తగ్గించి అందులో నిమ్మరసం పోసి దగ్గరకు పేరుకునే వరకూ స్టవ్‌ మీద ఉంచాలి. స్టవ్‌ ఆపేసి మెత్తటి నూలు గుడ్డ తీసుకుని పేరుకుపోయిన పాలను అందులో వడగొట్టాలి. ఆ పనీరులో నీరు అస్సలు ఉండకూడదు. మరో ప్యానులో ఉన్న సగానికి మరిగించిన పాలలో ఈ పనీరును కలిపి దగ్గరపడేదాకా ఉడికించాలి. ఇందులో చక్కెర కలిపి మరో రెండు మూడు నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఏలకుల పొడి, సీతాఫలం గుజ్జు వేసి బాగా కలపాలి. ఒక ప్లేటు తీసుకుని దానిపై నెయ్యి రాసి అందులో ఆ మిశ్రమాన్ని పోసి ప్లేటు మొత్తం పరచాలి. దానిపై పిస్తా ముక్కలు చల్లాలి. అది చల్లారిన తర్వాత ముక్కలుగా కోయాలి. కలాఖండ్‌ రెడీ

Updated Date - 2017-10-14T17:24:51+05:30 IST