చేపల పులుసు

ABN , First Publish Date - 2015-10-17T15:42:28+05:30 IST

కావలసిన పదార్థాలు: చేపలు: అరకిలో, కొత్తిమీర తరుగు:కప్పు, పసుపు: టేబుల్‌ స్పూను

చేపల పులుసు

కావలసిన పదార్థాలు: చేపలు: అరకిలో, కొత్తిమీర తరుగు:కప్పు, పసుపు: టేబుల్‌ స్పూను, టమోటాలు:పావుకిలో, బిర్యానీ ఆకు: కొద్దిగా, గరం మసాలా: టేబుల్‌స్పూను, కరివేపాకు: కొద్దిగా, సాంబారు ఉల్లిపాయలు:పావుకిలో, ఉప్పు: రుచికి సరిపడ, నూనె: తగినంత,
మసాలా కోసం: కొబ్బరి తురుము: కప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద:రెండు స్పూన్లు, మిరపకాయలు: పది లేక పన్నెండు, చింతపండు: 50 గ్రాములు, ధనియాల పొడి: టేబుల్‌స్పూను, సాంబారు ఉల్లిపాయలు: పావుకిలో, నూనె: తగినంత,
తయారీ విధానం: మందపాటి గిన్నెలో నూనె పోసి మసాలా సామానులోని ఉల్లిపాయలు, అల్లంవెల్లుల్లి ముద్దను వేసి దోరగా వేయించి, మిగతా పదార్థాలను కలిపి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే గిన్నెలో మరికొంత నూనె పోసి కాగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు రుబ్బిపెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసి అవసరం అనుకుంటే కొద్దిగా నీరుపోసి మెత్తగా ఉడికించాలి. ఉడుకుతున్న సమయంలో కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు చేపముక్కలను వేసుకొని రెండు లేదా మూడు నిమిషాలు ఉడకనిచ్చి గరం మసాలా చల్లి దించేంచాలి.

Updated Date - 2015-10-17T15:42:28+05:30 IST