కొర్రల పాయసం
ABN , First Publish Date - 2015-09-02T20:17:26+05:30 IST
కావలసిన పదార్థాలు: కొర్రలు - 1 కప్పు, శనగపప్పు - పావు కప్పు
కావలసిన పదార్థాలు: కొర్రలు - 1 కప్పు, శనగపప్పు - పావు కప్పు, పాలు - అర లీటరు, పచ్చి కర్జూరం - 1 కప్పు, జీడిపప్పు, ఎండుద్రాక్ష - పావుకప్పు, యాలకుల పొడి - అర టీ స్పూను, తేనె - ఒక టీ స్పూను, నెయ్యి - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం: కొన్ని నీళ్లు చిలకరించి కర్జూరాన్ని పేస్టులా చేసుకుని పక్కనుంచాలి. కొర్రల్ని దోరగా వేగించి, శనగపప్పుతో పాటు 3 కప్పులు నీరు పోసి 3 విజిల్స్ వచ్చేవరకు కుక్కర్లో ఉడికించాలి. చల్లారిన తర్వాత పాలు, కర్జూరం పేస్టు కలిపి చిన్నమంటపై బుడగలు వచ్చేవరకు ఉంచాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని నేతిలో వేగించిన జీడిపప్పు, కిస్మిస్లతో అలంకరించి, యాలకుల పొడి, తేనె చల్లి వేడి వేడిగా తినాలి.