నువ్వుల సద్ది

ABN , First Publish Date - 2019-10-05T19:24:55+05:30 IST

బియ్యం - 4 కప్పులు, నువ్వులు - అర కప్పు, ఎండు మిరపకాయలు - 4, పచ్చిమిర్చి - 4, కరివేపాకు - 2 రెబ్బలు, సెనగపప్పు - 2 టీస్పూన్లు, ఆవాలు, జీలకర్ర - అర

నువ్వుల సద్ది

కావలసినవి
 
బియ్యం - 4 కప్పులు, నువ్వులు - అర కప్పు, ఎండు మిరపకాయలు - 4, పచ్చిమిర్చి - 4, కరివేపాకు - 2 రెబ్బలు, సెనగపప్పు - 2 టీస్పూన్లు, ఆవాలు, జీలకర్ర - అర టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - 5 టీస్పూన్లు.
 
తయారీవిధానం
 
బియ్యం కడిగి అరగంట పాటు నాననివ్వాలి. తర్వాత కొద్దిగా పలుకుగా (పొడిపొడిగా ఉండేలా) వండి చల్లార్చుకోవాలి. ఒక పాత్రలో ఎండుమిర్చి, నువ్వులు దోరగా వేగించి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. వెడల్పాటి గిన్నెలో అన్నం తీసుకుని పొడి పొడిగా చేసుకుని ఒకస్పూన్‌ నూనె, పసుపు, తగినంత ఉప్పు, నువ్వుల పొడి వేసి బాగా కలియబెట్టి మూతపెట్టి ఉంచాలి. మరో గిన్నెలో మిగిలిన నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేయాలి. తర్వాత సెనగపప్పు, కరివేపాకు వేసి దోరగా వేగిన తర్వాత దింపేసి అన్నంలో వేసి కలపాలి. మొత్తం బాగా కలిపి మూతపెట్టి అరగంట తరువాత సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-10-05T19:24:55+05:30 IST