వెజిటబుల్‌ బిర్యానీ

ABN , First Publish Date - 2016-05-30T15:49:12+05:30 IST

కావలసినవి: బాస్మతి బియ్యం- ఒక కేజీ, నెయ్యి - 100 గ్రాములు, కారం - 20 గ్రాములు, గరంమసాలా పొడి- 30, గ్రాములు, ఉప్పు - 130 గ్రాములు, ధనియాల పొడి- 20

వెజిటబుల్‌ బిర్యానీ

కావలసినవి: బాస్మతి బియ్యం- ఒక కేజీ, నెయ్యి - 100 గ్రాములు, కారం - 20 గ్రాములు, గరంమసాలా పొడి- 30, గ్రాములు, ఉప్పు - 130 గ్రాములు, ధనియాల పొడి- 20 గ్రాములు, పసుపు- 10 గ్రాములు, వేగించిన ఉల్లి ముక్కలు (సన్నగా నిలువుగా కోసి)- 200 గ్రాములు, నిమ్మరసం- రెండు టీస్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 50 గ్రాములు, కొత్తిమీర తరుగు - 200 గ్రాములు, పచ్చి మిర్చి - 100 గ్రాములు, పుదీనా- 50 గ్రాములు, బిర్యానీ ఆకులు- 10 గ్రాములు, సోంపు - 10 గ్రాములు, మరాటి మొగ్గ - 10 గ్రాములు, కబాబ్‌ చిన్ని - 10 గ్రాములు, యాలక్కాయలు (పెద్దవి) - 10 గ్రాములు, పెరుగు- 200 గ్రాములు, బీన్స్‌ - 300 గ్రాములు, క్యారెట్‌- 300 గ్రాములు, నీళ్లు- ఐదు లీటర్లు
 
తయారీ: పైన చెప్పిన కూరగాయ ముక్కలన్నింటినీ ఒక గిన్నెలో వేయాలి. వాటిలో నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, గరం మసాలా పొడి, వేగించిన ఉల్లి ముక్కలు కొన్ని, పెరుగు, కొత్తిమీర, పుదీనాల తరుగు, ధనియాల పొడి, నూనె వేసి అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు నానబెట్టాలి. మరొక గిన్నెలో నీళ్లు పోసి అందులో గరంమసాలా, బిర్యానీ ఆకులు వేయాలి. నీళ్లు ఉడుకుపట్టాక కడిగిన బాస్మతి బియ్యం వేయాలి. బియ్యం సగం ఉడికాక నీళ్లను వంపేయాలి.
 
అన్ని వైపులా సమానంగా ఉన్న గిన్నె తీసుకుని నానబెట్టిన కూరగాయల్ని మొదటి పొరలా పరవాలి. దానిపైన సగం ఉడికిన బిర్యాని రైస్‌ వేసి నెయ్యి వేయాలి. గిన్నెని తవాపై పెట్టి సన్నటి మంట మీద పదినిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత గిన్నె మీద మూతపెట్టి అంచులను మైదాతో మూయాలి. మూతమీద మండుతున్న బొగ్గులు వేసి 20 నిమిషాలు ఉంచాలి. కొత్తిమీర, పుదీనాల తరుగు, జీడిపప్పు, వేగించిన ఉల్లి ముక్కలతో అలంకరించాలి. మిర్చి కా సలాన్‌, రైతాలతో ఈ బిర్యానీని తింటుంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే.

Updated Date - 2016-05-30T15:49:12+05:30 IST