ముర్గ్‌ దమ్‌ బిర్యానీ

ABN , First Publish Date - 2016-05-30T15:45:50+05:30 IST

కావలసినవి: బాస్మతి బియ్యం- ఒక కేజీ, చికెన్‌ - ఒక కేజీ (లెగ్‌, చెస్ట్‌పీస్‌లు) ,పెరుగు- 200 గ్రాములు , నిమ్మరసం- మూడు టీ స్పూన్లు ,కారం - 20 గ్రాములు,

ముర్గ్‌ దమ్‌ బిర్యానీ

కావలసినవి: బాస్మతి బియ్యం- ఒక కేజీ, చికెన్‌ - ఒక కేజీ (లెగ్‌, చెస్ట్‌పీస్‌లు) ,పెరుగు- 200 గ్రాములు , నిమ్మరసం- మూడు టీ స్పూన్లు ,కారం - 20 గ్రాములు, ధనియాల పొడి- 30 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌- 100 గ్రాములు, ఉప్పు- 50 గ్రాములు, గరంమసాలా- 20 గ్రాములు, రిఫైన్డ్‌ ఆయిల్‌- 100 గ్రాములు, వేగించిన ఉల్లి ముక్కలు (సన్నగా నిలువుగా కోసి.) - 30 గ్రాములు, జీడిపప్పు - కొద్దిగా, కొత్తిమీర తరుగు - 15 గ్రాములు, పుదీనా తరుగు - 15 గ్రాములు
బిర్యానీ ఆకులు- ఐదు గ్రాములు, డాల్డా లేదా నెయ్యి - 150 గ్రాములు, నీళ్లు- ఐదు లీటర్లు. ఈ కొలతలతో వండిన బిర్యానీ ఎనిమిది మందికి సరిపోతుంది.
 
తయారీ: చికెన్‌ను ఒక గిన్నెలో వేసి అందులో నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, గరంమసాలా, వేగించిన ఉల్లి ముక్కలు కొన్ని, పెరుగు, కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, నూనె వేసి కలపాలి. ఇలా కలిపిన చికెన్‌ని రెండు నుంచి మూడుగంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో నీళ్లుపోసి, గరంమసాలా పొడి వేయాలి. నీళ్లు ఉడుకు పట్టాక కడిగిపెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి సగం ఉడికించాక ఎసరు వంపేయాలి. అన్నివైపులా సమానంగా ఉన్న ఒక గిన్నె తీసుకుని నానబెట్టిన చికెన్‌ను ఒక పొరలా వేయాలి. దానిపైన సగం ఉడికిన బియ్యాన్ని వేయాలి. పైన కొంచెం నెయ్యి వేయాలి. ఈ గిన్నెను ఒక తవాపై ఉంచి సన్నటి మంట మీద 25 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత గిన్నె మీద మూత పెట్టి ఆవిరి బయటకు రాకుండా గిన్నెను, మూతను కలిపి మైదాతో మూసేయాలి. మండుతున్న బొగ్గులు మూతమీద వేయాలి. 20 నిమిషాల తర్వాత మూతను తీసి కొత్తిమీర, పుదీనాల తరుగు, జీడిపప్పు, వేగించిన ఉల్లిపాయ ముక్కలతో అలంకరించాలి. ఈ ముర్గ్‌ దమ్‌ బిర్యానీని రైతా, మిర్చి కా సలాన్‌తో కలిపి తింటే బాగుంటుంది.

Updated Date - 2016-05-30T15:45:50+05:30 IST