కజ్జికాయ సమోసాలు

ABN , First Publish Date - 2015-09-02T17:57:10+05:30 IST

కావలసినవి: మైదా - 500 గ్రాములు, పచ్చిబఠానీలు - ఒక క ప్పు, కొబ్బరి తురిమినది - అర క ప్పు,

కజ్జికాయ సమోసాలు

కావలసినవి: మైదా - 500 గ్రాములు, పచ్చిబఠానీలు - ఒక క ప్పు, కొబ్బరి తురిమినది - అర క ప్పు, పసుపు - ఒక టీ స్పూన్‌, జీలకర్ర పొడి - ఒక టీ స్పూన్‌, కారం - అర టీ స్పూన్‌, గరం మసాల - ఒక టీ స్పూన్‌, పంచదార - ఒక టీ స్పూన్‌, నూనె తగినంత, ఉప్పు తగినంత...
తయారీ విధానం:
మైదాలో ఉప్పు, నీరు వేసి పిండి మృదువుగా వచ్చేలా కలిపి ఉంచుకోండి. రెండు టేబుల్‌ స్పూన్‌ల నూనె వేడి చేసి అందులో పలుకుగా రుబ్బి ఉంచుకున్న బఠానీలు, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాల, కారం వేసి బాగా కలియబెట్టండి. అందులోనే కొబ్బరి, ఉప్పు, పంచదార వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి.
తరువాత మైదాని చిన్న ముద్దలుగా తీసుకుని కొంచెం వెడల్పుగా గుండ్రంగా వత్తి అందులో రెండు టీ స్పూన్ల బఠానీ కూరని పెట్టి చుట్టూ అంచులు జాగ్రత్తగా వత్తండి. ఇలా తయారు చేసి పెట్టుకున్న అర్ధచంద్రాకారపు సమోసాలని కాగిన నూనెలో వేసి ఎర్రగా వేగించండి. వేడి వేడిగా ఏదైనా చట్నీతో తింటే ఈ వర్షాకాలం చాలా బాగుంటాయి.

Updated Date - 2015-09-02T17:57:10+05:30 IST