శ్రీఖండ్
ABN , First Publish Date - 2015-09-03T18:10:14+05:30 IST
కావలసిన పదార్థాలు: పెరుగు - 500 గ్రా., పంచదార - 300 గ్రా., క్రీము - 50 గ్రా.,
కావలసిన పదార్థాలు: పెరుగు - 500 గ్రా., పంచదార - 300 గ్రా., క్రీము - 50 గ్రా., తరిగిన బాదం - 6, కుంకుమపువ్వు - 2గ్రా., యాలకులపొడి - 2 గ్రా.
తయారుచేసే విధానం: పంచదార, పెరుగు ఒక పాత్రలోకి తీసుకోవాలి. పంచదార కరిగి అందంతా మెత్తగా అయ్యేంత వరకు మెల్లగా గిలకొట్టాలి. తర్వాత ఒక గాజు పాత్రలోకి తీసుకొని క్రీము కలిపి, బాదం, కుంకుమపువ్వులతో అలంకరించాలి. రిఫ్రిజిరేటర్లో ఉంచి బాగా చల్లబడ్డాక తింటే చాలా రుచిగా ఉంటుంది.