మేతీపాలక్‌ పరోటా

ABN , First Publish Date - 2015-08-30T23:12:11+05:30 IST

కావలసిన పదార్థాలు : గోధుమపిండి - 100గ్రా., ఓట్స్‌ (సూపర్‌మార్కెట్లో దొరుకుతాయి) - 100గ్రా., పాలకూర - 100 గ్రా

మేతీపాలక్‌ పరోటా

కావలసిన పదార్థాలు : గోధుమపిండి - 100గ్రా., ఓట్స్‌ (సూపర్‌మార్కెట్లో దొరుకుతాయి) - 100గ్రా., పాలకూర - 100 గ్రా., మెంతికూర - 100 గ్రా., పనీర్‌ - 100గ్రా., పచ్చిమిర్చి - 2, పసుపు - అరస్పూను, ఇంగువ - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం : ముందుగా పచ్చిమిర్చి, పాలకూర, మెంతికూరల్ని సన్నగా తరిగి ఉంచుకోవాలి. పనీర్‌ని తురుముకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద పాత్రలో అన్ని పదార్థాలూ వేసి తగినంత నీరు కలుపుతూ ముద్దలా చేసి ఒక తడిబట్ట కప్పి అరగంట పాటు నానబెట్టాలి. తర్వాత 10 సమాన భాగాల ఉండలు చేసుకుని పరాటాలు చేసుకొని పెనంపై రెండువైపులా దోరగా కాల్చుకుని మీకిష్టమైన కూరతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇది మంచి విటమిన్‌ ఫుడ్‌. 

Updated Date - 2015-08-30T23:12:11+05:30 IST