మష్రూమ్‌ ఊతప్పం

ABN , First Publish Date - 2019-10-19T18:40:16+05:30 IST

బియ్యం - అరకేజీ, పుట్టగొడుగులు - 30 గ్రాములు, మినప్పప్పు - పావుకేజీ, శనగపప్పు - 100గ్రాములు, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - కొద్దిగా, కార్న్‌

మష్రూమ్‌ ఊతప్పం

కావలసినవి
 
బియ్యం - అరకేజీ, పుట్టగొడుగులు - 30 గ్రాములు, మినప్పప్పు - పావుకేజీ, శనగపప్పు - 100గ్రాములు, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - కొద్దిగా, కార్న్‌ - 20 గ్రాములు(ఉడికించినవి).
 
తయారీవిధానం
 
ముందురోజు రాత్రి బియ్యం, మినప్పప్పు, శనగపప్పు నానబెట్టుకోవాలి. ఉదయాన్నే నీళ్లన్నీ తీసేసి తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. ఒక దోసె పాన్‌ తీసుకొని కొద్దిగా నూనె వేసి గ్రైండ్‌ చేసిన మిశ్రమంతో ఊతప్పం వేయాలి.
దానిపై ఉడికించిన కార్న్‌ వేయాలి. ఊతప్పం బాగా కాలడం కోసం పైన కొంచెం నూనె వేయాలి. ఒకవైపు కాలిన తరువాత ఊతప్పం తిప్పి వేసి మరోవైపు కాల్చాలి. చట్నీతో తింటే మష్రూమ్‌ ఊతప్పం టేస్ట్‌ అదుర్స్‌!

Updated Date - 2019-10-19T18:40:16+05:30 IST