అరటిపండు పూర్ణాలు

ABN , First Publish Date - 2015-10-12T14:12:45+05:30 IST

కావలసిన పదార్థాలు: కొద్దిగా పండిన అరటిపళ్ళు: ఆరు, పచ్చి కొబ్బరి తురుము: కప్పు, చక్కెర: ఒకటి లేదా

అరటిపండు పూర్ణాలు

కావలసిన పదార్థాలు: కొద్దిగా పండిన అరటిపళ్ళు: ఆరు, పచ్చి కొబ్బరి తురుము: కప్పు, చక్కెర: ఒకటి లేదా రెండు స్పూన్లు, యాలకుల పొడి: అర స్పూను, జీడిపప్పు, కిస్మిస్‌లు:కావలసినన్ని, మైదా నాలుగు స్పూన్లు, ఉప్పు: చిటికెడు, నెయ్యి: రెండు లేదా మూడు స్పూన్లు, నూనె: వేయించడానికి సరిపడ.
తయారీ విధానం: అరటిపండును ఆవిరి మీద కొద్దిసేపు ఉడికించుకోవాలి. అవి చల్లారిన తరువాత పై తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. బాండీలో నెయ్యి వేసి కాగిన తరువాత అరటిపండు ముక్కలు, చక్కెర, కొబ్బరిపొడి, జీడిపప్పు, కిస్మిస్‌లు వేసి దోరగా వేయించుకుని దింపేయాలి. ఇవి చల్లారిన తరువాత చేతితో మెత్తగా చేసుకొని సమాన భాగాలుగా ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మైదా పిండిలో తగినంత నీరు ఉప్పు వేసి గంటెజారుగా చేసుకొని అందులో సిద్ధం చేసి పెట్టుకున్న అరటిపండు వుండలు వేసి నూనెలో దోరగా వేయించుకోవాలి.

Updated Date - 2015-10-12T14:12:45+05:30 IST