ఆ పత్రికలు, ఛానళ్లను పూర్తిగా నిషేధిస్తున్నాం: మంత్రి కొడాలి
ABN , First Publish Date - 2022-01-06T23:28:05+05:30 IST
ఏబీఎన్, ఆంధ్రజ్యోతి (పత్రిక), ఈనాడు (పత్రిక), ఈటీవీ, టీవీ5ను ఈ రోజు నుంచి పూర్తిగా నిషేధిస్తున్నామని ...
అమరావతి: ఏబీఎన్, ఆంధ్రజ్యోతి (పత్రిక), ఈనాడు (పత్రిక), ఈటీవీ, టీవీ5ను ఈ రోజు నుంచి పూర్తిగా నిషేధిస్తున్నామని మంత్రి కొడాలి అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఈ నాలుగింటిని నిషేధించాలని వైసీపీ నేతలకు సూచించారు. వైసీపీ కార్యక్రమాలు, మీడియా సమావేశాలు, ఇంటర్వూలకు పిలవొద్దని కొడాలి నాని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ అధికార ప్రతినిధులు, వైసీపీ నాయకులు ఈ పత్రికలు, ఛానళ్ల వాళ్లతో మాట్లాడవద్దని ఆదేశిస్తున్నట్లు నాని తెలిపారు.