NRI TRS Kuwait: ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడిని ఖండించిన అభిలాష గొడిశాల
ABN , First Publish Date - 2022-08-24T23:02:48+05:30 IST
ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడికి పాల్పడిన బీజేపీ నేతల చర్యలను ఎన్నారై టీఆర్ఎస్ కువైత్ ఖండించింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి కవితపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేసింది. ఈ మేరకు NRI TRS Kuwait అధ్యక్షరాలు అభిలాష గొడిశాల ప్రకటన వి
ఎన్నారై డెస్క్: ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడికి పాల్పడిన బీజేపీ నేతల చర్యలను ఎన్నారై టీఆర్ఎస్ కువైత్ ఖండించింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి కవితపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేసింది. ఈ మేరకు NRI TRS Kuwait అధ్యక్షరాలు అభిలాష గొడిశాల ప్రకటన విడుదల చేశారు. రాజకీయంగా TRS పార్టీని, CM KCRను ఎదుర్కొనే దమ్ము లేకనే బీజేపీ నిరాధారమైన ఆరోపణలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజల్లో బీజేపీ మరింత చులకనవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న టీఆర్ఎస్ నాయకత్వంపై బురదజల్లి, మునుగోడు ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తోందన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్ను భయపెట్టలేరన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కేసీఆర్ భయం పట్టుకుందని, ప్రాంతీయ పార్టీలపట్ల కక్ష పూరిత విధానాలను అనుసరిస్తోందన్నారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నదని ఆరోపించారు. బీజేపీ మతతత్వ, కక్షపూరిత రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని.. సరైన సమయంలో ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని అభిలాష గొడిశాల స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవితకు ఎన్నారై టీఆరెఎస్ కువైట్ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు.