ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-05-18T17:57:47+05:30 IST

ఎట్టకేలకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరావుపై సస్పెన్షన్‌‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది.

ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన ప్రభుత్వం

అమరావతి : ఎట్టకేలకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరావుపై సస్పెన్షన్‌‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. జీఏడీలో రిపోర్టు చేయాలని ఏబీ వెంకటేశ్వరావుకు ఆదేశాలు అందాయి. సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ సీఎస్‌ సమీర్‌శర్మ జీవో జారీ చేశారు. సస్పెన్షన్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. చివరకు సుప్రీంకోర్టులో సైతం ఏబీ వెంకటేశ్వరరావు న్యాయపోరాటం చేశారు. ఫిబ్రవరి 8 నుంచి సర్వీస్‌లోకి తీసుకుంటున్నట్టు ప్రభుత్వం జీవో జారీ చేసింది.

Updated Date - 2022-05-18T17:57:47+05:30 IST