అటెండర్ల సేవలు ఆదర్శనీయం
ABN , First Publish Date - 2022-07-07T03:10:24+05:30 IST
దశాబ్దకాలంగా ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్లుగా పనిచేసిన లక్ష్మమ్మ, పద్మ, శ్రీనాథ్ల సేవలు ఆదర్శనీయమని కావలి
కావలి రూరల్, జూలై6: దశాబ్దకాలంగా ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్లుగా పనిచేసిన లక్ష్మమ్మ, పద్మ, శ్రీనాథ్ల సేవలు ఆదర్శనీయమని కావలి ఎంపీడీవో అమ్మిశెట్టి వెంకటసుబ్బారావు అన్నారు. కావలి ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్లుగా పనిచేసి ముత్తుకూరుకు బదిలీపై వెళ్తున్న లక్ష్మమ్మ, జలదంకి ఎంపీడీవో కార్యాలయా నికి బదిలీపై వెళ్తున్న పద్మ, శ్రీనాథ్లను బుధవారం సాయంత్రం ఎంపీడీవో ఆధ్వర్యంలో కార్యాలయ సిబ్బంది శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఎంపీడీవో వెంకటసుబ్బారావు మాట్లాడుతూ ఉద్యోగుల బదిలీలు సాధారణమే అయినా గత పదేళ్లుగా వీరందించిన సేవలు కార్యాలయ ప్రగతికి ఎంతగానో దోహదపడ్డాయ న్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.