వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు..

ABN , First Publish Date - 2020-07-16T15:26:36+05:30 IST

అమరావతి: వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపు పథకం నేటి నుంచి 6 జిల్లాలకు ఏపీ ప్రభుత్వం విస్తరించనుంది.

వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు..

అమరావతి: వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపు పథకం నేటి నుంచి 6 జిల్లాలకు ఏపీ ప్రభుత్వం విస్తరించనుంది. 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ప్రారంభించనున్నారు. విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల్లో ప్రారంభమైంది. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కొనసాగుతోంది. మిగిలిన జిల్లాలకు నవంబర్ 14న ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది.


Updated Date - 2020-07-16T15:26:36+05:30 IST