Durgesh Pathak: ఢిల్లీలో బీజేపీకి ఎదురుదెబ్బ.. రాజేంద్ర నగర్ ఉప ఎన్నికలో ఆప్ అభ్యర్థి దుర్గేష్ పాతక్ గెలుపు
ABN , First Publish Date - 2022-06-26T23:11:23+05:30 IST
ఢిల్లీలోని రాజేంద్ర నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ అభ్యర్థి రాజేష్ భాటియాపై..
న్యూఢిల్లీ: ఢిల్లీలోని రాజేంద్ర నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ అభ్యర్థి రాజేష్ భాటియాపై ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి దుర్గేష్ పాతక్ (Durgesh Pathak) 11,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ప్రకటించారు. ఆప్ అభ్యర్థి దుర్గేష్ పాతక్ను గెలిపించడం పట్ల అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజల ప్రేమాభిమానాలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, రాజేంద్ర నగర్ ప్రజలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. నీచ రాజకీయాలను ప్రజలు ఓడించారని, తమ పనితీరును మెచ్చుకున్నారని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు.