విభజన హామీలు నెరవేర్చకుండా సభలేంటి?
ABN , First Publish Date - 2022-07-02T06:26:55+05:30 IST
విభజన హామీలు నెరవేర్చకుండా సభలేంటి?
బీజేపీకి ఆప్ రాష్ట్ర కన్వీనర్ వరప్రసాద్ ప్రశ్న
దెందులూరు, జూలై 1: రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రజలను ఇబ్బంది పెడుతోందని, విభజన హామీలు నేరవేర్చకుండా భారీ బహిరంగ సభలు పెట్టడమేంటని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రాష్ట్ర కన్వీనర్ కేవీబీవీ వరప్రసాద్ ప్రశ్నించారు. శుక్రవారం దెం దులూరు నియోజకవర్గంలోని కొవ్వలి మోటపర్తి భవన్లో ఆప్ జిల్లా కన్వీనర్ మన్నవ రఘురాం అఽధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలుగు వారిని మోసం చేసి తెలుగు బిడ్డ అల్లూరి విగ్రహానికి దండలు వేయడమేంటన్నారు. 2024లో రాష్ట్రంలోని 175 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుం దన్నారు. ప్రజాచైతన్య యాత్ర కో–ఆర్డినేటర్ కొప్పోలు విజయ్ కుమార్, సున్నం అంజనేయులు, జల్లి నాగేశ్వరావు, కొమ్మిరెడ్డి వెంకట సత్యనారాయణ. దొడ్డిగర్ల సుమలత, ఆకుల సురేష్ పాల్గొన్నారు.