ఆప్‌ తీర్థం పుచ్చుకున్న ‘ముఖ్యమంత్రి చంద్రు’

ABN , First Publish Date - 2022-06-08T17:07:07+05:30 IST

ప్రముఖ సినీనటుడు ‘ముఖ్యమంత్రి చంద్రు’ అనూహ్యంగా మంగళవారం ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)లో చేరారు. బెంగళూరులో జరిగిన

ఆప్‌ తీర్థం పుచ్చుకున్న ‘ముఖ్యమంత్రి చంద్రు’

బెంగళూరు, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీనటుడు ‘ముఖ్యమంత్రి చంద్రు’ అనూహ్యంగా మంగళవారం ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)లో చేరారు. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వీరెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్‌రావుతోపాటు సీనియర్‌ నేతలు విజయ్‌శర్మ, మోహన్‌ దాసరి, జగదీశ్‌ వీసదం, సురేశ్‌ రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రు మీడియాతో మాట్లాడుతూ నాటకంలో ‘ముఖ్యమంత్రి’ పాత్ర ద్వారా అవినీతిని చీల్చిచెండాడిన తనకు రాజకీయంగా ఆప్‌ సరిపోతుందని భావించి పార్టీలో చేరానన్నారు. ఆప్‌ తరపున అన్ని ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేస్తానని తెలిపారు. 

Updated Date - 2022-06-08T17:07:07+05:30 IST