ఇది సామాన్యుడి విజయం: మనీష్ సిసోడియా
ABN , First Publish Date - 2022-03-10T17:23:55+05:30 IST
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. ముఖ్యంగా పంజాబ్లో అధికారం దక్కించుకునే దిశగా దూసుకెళ్తోంది ఆప్.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. ముఖ్యంగా పంజాబ్లో అధికారం దక్కించుకునే దిశగా దూసుకెళ్తోంది ఆప్. 117 అసెంబ్లీ స్థానాలున్నపంజాబ్లో ఆప్ 89 స్థానాల్లో ముందంజలో ఉంది. గోవాలోనూ రెండు సీట్లు సాధించే దిశగా దూసుకెళ్తోంది. దీంతో కేజ్రీవాల్ పాలనా విధానానికి పంజాబ్ ఆమోదం లభించిందని, ఇప్పుడు ఆయన పాలనకు జాతీయ గుర్తింపు దక్కిందని ఆప్ నేత మనీష్ సిసోడియా అన్నారు. పంజాబ్లో ఆప్ గెలవడం సామాన్యుడి విజయంగా ఆయన అభివర్ణించారు. గోవా, యూపీ, ఉత్తరాఖండ్లలో కూడా ఆప్ అభ్యర్థుల్ని నిలిపినప్పటికీ, ప్రధానంగా పంజాబ్పైనే దృష్టిసారించామని మనీష్ చెప్పారు. త్వరలో అన్ని రాష్ట్రాల్లో ఆప్ను ప్రజలు గుర్తిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.