మిగతా పార్టీల్లాంటి హామీలు ఆప్ ఇవ్వదు: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2022-04-16T22:19:59+05:30 IST

మిగతా రాజకీయ పార్టీల్లాగ తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసే పనులు ఆమ్ ఆద్మీ పార్టీ చేయదని ఆ పార్టీ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. రాష్ట్రంలోని..

మిగతా పార్టీల్లాంటి హామీలు ఆప్ ఇవ్వదు: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: మిగతా రాజకీయ పార్టీల్లాగ తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసే పనులు ఆమ్ ఆద్మీ పార్టీ చేయదని ఆ పార్టీ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. ఈ విషయాన్ని కేజ్రీవాల్ ప్రస్తావిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. సీఎం భగవంత్ మాన్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన కేజ్రీవాల్.. పంజాబ్‌లో అవినీతిని అంతం చేసే ప్రభుత్వం ఏర్పడిందని, దేశభక్తి కలిగిన నిజాయితీ కలిగిన ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటను ఆప్ నిలబెట్టుకుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని, అభివృద్ధికి కేటాయించే నిధుల్లో కొరత రానివ్వమని కేజ్రీవాల్ అన్నారు.

Updated Date - 2022-04-16T22:19:59+05:30 IST