AP News: ఆమరణ నిరాహార దీక్షకు దిగిన దళిత జేఏసీ నేతలు
ABN , First Publish Date - 2022-09-03T17:50:07+05:30 IST
దళిత జేఏసీ నేత చిలకా బసవయ్య, ఇతర దళిత నేతలు ఆమరణ నిరాహారదీక్షకు దిగారు.
అమరావతి (Amaravathi): తుళ్లూరులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి దళిత జేఏసీ నేత చిలకా బసవయ్య, ఇతర దళిత నేతలు ఆమరణ (Aamarana Nirahara Dheeksha) నిరాహారదీక్షకు దిగారు. ఈ సందర్భంగా బసవయ్య మీడియాతో మాట్లాడుతూ 3,139 మంది దళిత రైతులు 2,689 ఎకరాల అసైన్డ్ భూమిని ల్యాండ్ పూలింగ్కు ఇస్తే మంత్రుల కమిటీ అని, సీఐడీ విచారణ అని, దళిత రైతులకు ప్రభుత్వం కౌలు చెల్లించడం లేదన్నారు. కౌలు చెల్లిస్తారని మూడేళ్లుగా ఎదురు చూశామన్నారు. ఇక ఓపిక పట్టలేమని, అందుకే అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగామని స్పష్టం చేశారు. అయితే ఈ దీక్షకు అనుమతి లేదని, డీఎస్పీ నుంచి అనుమతి తెచ్చుకొని దీక్ష చేసుకోవాలని పోలీసులు చేసిన విజ్ఞప్తిని దళిత నేతలు తిరస్కరించారు. పూర్తి సమాచారం అందాల్సి ఉంది.