ఆమ్‌ ఆద్మీ పార్టీని ఆదరించాలి

ABN , First Publish Date - 2022-05-23T05:08:02+05:30 IST

ఆమ్‌ ఆద్మీ పార్టీని ఆదరించాలని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇన్‌చార్జి ఆర్‌.మణినాయుడు కోరారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీని ఆదరించాలి
ర్యాలీ నిర్వహిస్తున్న ఆమ్‌ ఆద్మీపార్టీ నాయకులు

ప్రొద్దుటూరు టౌన్‌, మే 22 : ఆమ్‌ ఆద్మీ పార్టీని ఆదరించాలని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇన్‌చార్జి ఆర్‌.మణినాయుడు కోరారు. ఆదివారం ఆ పార్టీ నాయకులు అమ్మవారిశాల నుంచి రాజీవ్‌ సర్కిల్‌ వరకు ప్రజా చైతన్య యాత్రను నిర్వహించి పాతబస్టాండ్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం ఎన్జీఓ హోంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆమ్‌ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని తెలిపారు. ఢిల్లీలో ఆయన చేస్తున్న అభివృద్ధికి ప్రజలు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు తమ పార్టీని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ఆప్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఫిజా దస్తగిర్‌, పట్టణాధ్యక్షుడు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-23T05:08:02+05:30 IST