నెలాఖరు వరకూ ఆకివీడు చేపల మార్కెట్ బంద్
ABN , First Publish Date - 2020-06-05T17:18:28+05:30 IST
నెలాఖరు వరకూ ఆకివీడు చేపల మార్కెట్ బంద్
పశ్చిమ గోదావరి/ఆకివీడు: కరోనా అన్ని రంగాలనూ దెబ్బతీసింది. ఒక పక్క ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులిచ్చినా ఇంకా తేరుకోలేదు. ప్రస్తుతం ఆకివీడు మార్కెట్దీ ఇదే పరిస్థితి. గతంలో ఆకివీడు మార్కెట్ నిత్యం వ్యాపారులతో కళకళలాడుతూ ఉండేది. ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తోంది. దీంతో ఆకివీడు చేపల మార్కెట్కు సెలవు ప్రకటించారు. రవాణా సదుపాయం అంతగా మెరుగుపడక పోవడం.. కరోనా భయం కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలుదారులు ఆకివీడు చేపల మార్కెట్కు రావడం లేదు. దీంతో హోల్సేల్ చేపల మార్కెట్ ఖాళీగా దర్శనమిస్తోంది. దీంతో ఈ నెలాఖరు వరకు మార్కెట్ మూసివేస్తున్నట్టు సంఘం అధ్యక్షుడు షేక్ సుభానీ తెలిపారు. స్థానిక హోల్సేల్ చేపల మార్కెట్ సంఘం వర్తకులతో చర్చించి తీర్మానం చేశారు. అధికారులు ఈ నెల ఒకటో తేదీ నుంచి మార్కెట్ పునఃప్రారంభానికి అనుమతులిచ్చినా ఇతర రాష్ట్రాలకు రైళ్లు, బస్సులు నడవక రవాణా స్తంభించడంతో వ్యాపారాలు జరగడం లేదన్నారు. అందుకే మార్కెట్ మూసివేస్తున్నట్టు తెలిపారు.