పంటల బీమాకు ఆధార్‌ తప్పనిసరి

ABN , First Publish Date - 2021-04-13T09:48:03+05:30 IST

రైతులు పంటల బీమా, రాయితీ విత్తనాలను పొందడానికి ఆధార్‌ గుర్తింపు సంఖ్యను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పంటల బీమాకు ఆధార్‌ తప్పనిసరి

రాయితీ విత్తనాలకు కూడా..


అమరావతి, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): రైతులు పంటల బీమా, రాయితీ విత్తనాలను పొందడానికి ఆధార్‌ గుర్తింపు సంఖ్యను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుభరోసా కేంద్రాల ద్వారా ఆర్థిక సహాయం, రాయితీలు, ఇతర సేవలకు ఆధార్‌ను ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. పథకాల లబ్ధికి ఆధార్‌ లేకపోతే, ముందుగా ఆధార్‌ నమోదు చేయించుకోవాలని పేర్కొంది. ఆధార్‌ నమోదుకు 8 రకాల గుర్తింపు పత్రాలు, లేదా గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని సూచించింది. రైతులు ఈ రాయితీ పథకాలు పొందటానికి బహుళ ధ్రువీకరణ పత్రాల అవసరాన్ని తొలగించి, నేషషన్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌(నిక్‌) ద్వారా అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సోమవారం వేర్వేరు జీవోలు జారీ చేశారు. 

Updated Date - 2021-04-13T09:48:03+05:30 IST