ఆదమరిస్తే.. అంతే సంగతులు

ABN , First Publish Date - 2021-10-26T03:45:13+05:30 IST

మండలంలో నరుకూరు నుంచి తోటపల్లిగూడూరు వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డులో వంతెనకు రంధ్రం పడినా సంబంధిత శాఖ అధికారులు చ

ఆదమరిస్తే.. అంతే సంగతులు
నరుకూరు రోడ్డులో వంతెనకు పడిన రంధ్రం

 నరుకూరు రోడ్డులో బ్రిడ్జికి రంధ్రం

 తరచూ ప్రమాదాలు

తోటపల్లిగూడూరు, అక్టోబరు 25 : మండలంలో నరుకూరు నుంచి తోటపల్లిగూడూరు వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డులో వంతెనకు రంధ్రం పడినా సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టలేదు. ఈ రోడ్డుపై నిత్యం వేలాది మంది ఉద్యోగులు ప్రయాణిస్తుంటారు. ఇటీవల స్కూటరిస్టు ఆ వంతెన గుంతలో పడి స్వల్ప గాయాలతో బయటప డ్డాడు. అంతేకాక ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో రోడ్డు పక్కన ఉన్న గ్రామస్థులు ఆ గుంటకు చుట్టూ మట్టిబస్తాలు వేశారు. ఇటీవల వర్షం కురవడంతో ఆ మట్టి బస్తాలు కరిగిపోయాయి. ఏ ప్రయాణికుడైనా ఆదమరిస్తే..  ప్రమాదానికి గురికావాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి  వంతెన రంధ్రానికి మరమ్మతులు చేయాలని నరుకూరు గ్రామస్థులు కోరుతున్నారు.


Updated Date - 2021-10-26T03:45:13+05:30 IST