TS News: భద్రాద్రిలో అబార్షన్ వికటించి యువతి కన్నుమూత

ABN , First Publish Date - 2022-08-19T16:46:19+05:30 IST

జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓ యువతి అబార్షన్ వికటించడంతో కన్నుమూసింది.

TS News: భద్రాద్రిలో అబార్షన్ వికటించి యువతి కన్నుమూత

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓ యువతి అబార్షన్ వికటించడంతో కన్నుమూసింది. ముల్కలపల్లి మండలం వీ కే రామవరంకు చెందిన డిగ్రీ సెకండ్ ఇయర్ యువతిని ఓ యువకుడ ట్రాప్ చేసి గర్భవతిని చేశాడు. అయితే గర్భాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగా సదరు యువకుడు భార్యభర్తలమని నమ్మించి యువతిని ఆస్పత్రిలో చేర్చాడు. కాగా అబార్షన్ వికటించి యువతి మృతి చెందడంతో యువకుడు పరారయ్యాడు. విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-08-19T16:46:19+05:30 IST