Suicide: ట్యాంక్బండ్లో దూకి యువతి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-07-20T15:05:34+05:30 IST
నగరంలోని ట్యాంక్ బండ్లో దూకి శైలజ(38) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్: నగరంలోని ట్యాంక్ బండ్లో దూకి శైలజ(38) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. చున్నీతో మెడకు బిగించుకుని మరీ యువతి ట్యాంక్ బండ్ వాటర్లో దూకేసింది. శైలజ గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో డిప్రెషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం 5 గంటలకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన శైలజ... ట్యాంక్ బండ్లో శవమై తేలింది. భర్త చనిపోవడం, అనారోగ్య సమస్యలతో డిప్రెషన్లో సూసైడ్ చేసుకుంది. శైలజ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతుకగా... ట్యాంక్ బండ్లో మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.