చేపల వేటకు వెళ్లిన యువకుడు మృత్యువాత
ABN , First Publish Date - 2021-01-19T05:20:22+05:30 IST
జుల కిందట చేపల వేటకు వెళ్లిన యువకుడు మృతిచెందాడు సోమవారం ఉదయం ఆ యువకుడి మృత దేహం తోటపల్లి ప్రాజెక్ట్లో లభించింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుణానుపురం గ్రామానికి చెందిన నందేడ అశోక్ (35) శనివారం సాయంత్రం చేపల వేటకు వెళ్లాడు. అటవీ చెట్ల బెరడుతో తయారు చేసిన తూముపై నాగావళి నది (తోటపల్లి డ్యాం నీరు పోటు
కొమరాడ, జనవరి 18:రెండు రోజుల కిందట చేపల వేటకు వెళ్లిన యువకుడు మృతిచెందాడు సోమవారం ఉదయం ఆ యువకుడి మృత దేహం తోటపల్లి ప్రాజెక్ట్లో లభించింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుణానుపురం గ్రామానికి చెందిన నందేడ అశోక్ (35) శనివారం సాయంత్రం చేపల వేటకు వెళ్లాడు. అటవీ చెట్ల బెరడుతో తయారు చేసిన తూముపై నాగావళి నది (తోటపల్లి డ్యాం నీరు పోటుకాసే ప్రాంతం) లో చేపల వేటకు వెళ్లాడు. కానీ రాత్రికి ఇంటికి చేరలేదు. కుటుంబసభ్యులు వెతికినా ప్రయోజనం లేకపోయింది. డ్యాం తూము సమీపంలో సోమవారం ఉదయం మృతదేహం తేలింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని బయ టకు తీశారు. అశోక్ మృతదేహంగా గుర్తించారు. తూముపై నుంచి ప్రమాదవశా త్తూ పడి మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి భార్య మంగ, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతదేహం వద్ద కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ జ్ఞానప్రసాద్ తెలిపారు.