అలల దాటికి కొట్టుకుపోయిన యువకుడు
ABN , First Publish Date - 2021-10-11T23:04:29+05:30 IST
జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నుండి వచ్చిన ఐదుగురు యువకులు సబ్ మెరైన్ వద్ద...
విశాఖ: జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నుండి వచ్చిన ఐదుగురు యువకులు సబ్ మెరైన్ వద్ద స్నానం చేస్తుండగా అలల దాటికి సముద్రంలోకి కొట్టుకుపోయారు. ఐదుగురు యువకులలో నలుగురిని లైఫ్ గార్డ్స్ సిబ్బంది రక్షించారు. బుజ్జి అనే యువకుడు గల్లంతయ్యాడు. అ యువకుడి కోసం గాలింపు చర్యలుకొనసాగిస్తున్నారు. యువకులంతా అజిత్ సింగినగర్ వాంబే కాలనీకి చెందిన వారుగా గుర్తించారు.