ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-07-25T05:41:06+05:30 IST
ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు మృతిచెందాడు.
దామరచర్ల, జూలై 24 : ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు మృతిచెందాడు. ఈసంఘటన శనివారం మండలకేంద్రం శివారులో చోటుచేసుకొంది. సంఘటనకు సంబంధించి ఎస్ఐ విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... మిర్యాలగూడకు చెందిన చల్లా రాఘవ (22) ద్విచక్రవాహనంపై దామరచర్ల వైపుకు వస్తున్న క్రమంలో నార్కట్పల్లి-అద్దంకి రహదారి వెంట నడుచుకొంటూ వెళ్తున్న శ్రీకాకుళానికి చెందిన శీల తున్నను ఢీకొట్టి అదుపుతప్పి క్రిందపడ్డాడు. ఈప్రమాదంతో తలకు బలమైన గాయాలతో రాఘవ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదంలో గాయపడ్డ శీల తున్నను మిర్యాలగూడకు చికిత్స నిమిత్తం తరలించారు. రాఘవ కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా మృతుడు రాఘవ వాటర్ సర్వీసింగ్ సెంటర్లో పని చేస్తున్నాడు.