బోరు లారీనుంచి టైరుపడి యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-01-25T05:07:27+05:30 IST

బోరు లారీనుంచి టైరుపడి యువకుడి మృతి

బోరు లారీనుంచి టైరుపడి యువకుడి మృతి
మృతిచెందిన నిఖిల్‌రెడ్డి

పరిగి, జనవరి 24: బోరులారీపై ఉన్న టైరు, రోడ్డు గుండా బైక్‌పై వెళుతున్న యువకుడిపై ప డడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం రాఘవాపూర్‌ సమీపంలో జరిగింది. మహబూబ్‌నగర్‌ జిల్లా కొయిల్‌కొండకు చెందిన నిఖిల్‌రెడ్డి(23) పరిగి నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా రాఘవాపూర్‌ సమీపంలో ఎదురుగా వసున్న బోరులారీపై ఉన్న టైరు కిందపడింది. అటుగా బైక్‌పై వస్తున్న నిఖిల్‌రెడ్డిపై పడింది. తీవ్రగాయాలైన అతడు అక్కడికక్కడే మృదిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బోరులారీని స్వాదీనం చేసుకున్నారు.

Updated Date - 2022-01-25T05:07:27+05:30 IST