ఒకే మంటపంలో ఇద్దరిని పెళ్లాడిన కుర్రాడు.. వధువుల ఒడిలో చెరో పాపను చూసి బంధువులంతా షాక్.. అసలు కథేంటంటే..
ABN , First Publish Date - 2022-06-11T17:06:41+05:30 IST
ఛత్తీస్గఢ్లోని కొండగావ్లో తాజాగా ఓ విచిత్ర వివాహం జరిగింది. ఓ యువకుడు తన ఇద్దరు ప్రియురాళ్లను ఒకే మండపంలో పెళ్లి చేసుకున్నాడు.
ఛత్తీస్గఢ్లోని కొండగావ్లో తాజాగా ఓ విచిత్ర వివాహం జరిగింది. ఓ యువకుడు తన ఇద్దరు ప్రియురాళ్లను ఒకే మండపంలో పెళ్లి చేసుకున్నాడు. విశేషమేమిటంటే.. వరుడు తన భార్యలిద్దరినీ పెళ్లికి ముందే తల్లులను చేశాడు. ప్రియురాళ్లు ఇద్దరూ తమ తమ కూతుళ్లతో పీటల మీద వరుడికి ఇరుపక్కలా కూర్చున్నారు. బంధుమిత్రుల సమక్షంలో వరుడు ఆ ఇద్దరినీ పెళ్లి చేసుకున్నాడు. శుభలేఖలో వరుడి పేరు కింద వధువుల ఇద్దరూ పేర్లూ రాశారు. ఈ వివాహం చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి..
బైక్పై వెళ్తున్న అన్న.. రోడ్డుపై ప్రియుడితో నడుచుకుంటూ వెళ్తున్న చెల్లిని చూసి సడన్ బ్రేక్.. అంతా చూస్తుండగానే..
ఛత్తీస్గఢ్లోని కొండగావ్కు సమీపంలోని ఉమ్లా గ్రామానికి చెందిన రాజన్సింగ్కు కొద్ది రోజుల క్రితం దుర్గేశ్వరితో నిశ్ఛితార్థం జరిగింది. వివాహం జరగకముందే దుర్గేశ్వరి, రాజన్సింగ్ ఇంటికి వెళ్లిపోయింది. కొన్ని నెలల తర్వాత దుర్గేశ్వరి గర్భం దాల్చి ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. అదే సమయంలో రాజన్ సింగ్.. అన్వారీకి చెందిన సన్నో బాయి అనే యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఫలితంగా ఆమె కూడా గర్భం దాల్చింది. ఇటీవల ఓ కుమార్తెకు జన్మనిచ్చింది. ఈ విషయం బయటపడడంతో గ్రామంలో కలకలం మొదలైంది.
గ్రామపెద్దలు పంచాయతీ నిర్వహించారు. ఆ ఇద్దరు యువతులు రాజన్ సింగ్ను వివాహం చేసుకోవడానికి అంగీకరించారు. మూడు కుటుంబాల వారు అంగీకరించడంతో రాజన్ సింగ్ ఒకే మండపంలో ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. దుర్గేశ్వరి, సన్నోబాయి తమ తమ కూతుళ్లతోనే పీటల మీద కూర్చోవడం విశేషం.