బావిలో శవమై తేలిన యువకుడు

ABN , First Publish Date - 2021-09-19T04:22:21+05:30 IST

అదృశ్యమైన యువకుడు బావిలో శవమై కనిపించాడు.

బావిలో శవమై తేలిన యువకుడు

చిన్నశంకరంపేట, సెప్టెంబరు 18 : అదృశ్యమైన యువకుడు బావిలో శవమై కనిపించాడు. కుటుంబీకులు, పోలీసుల వివరాల ప్రకారం మండలంలోని కొర్వీపల్లికి చెందిన లస్మగల్ల నవీన్‌ (22) గురువారం ఇంటి నుంచి పొలానికి వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబీకులు మూడురోజులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం మృతుడి తండ్రి నర్సయ్య వ్యవసాయ పొలానికి వెళ్లాడు. అయితే పక్కనున్న బావిలో నవీన్‌ మృతదేహం కనిపించింది. గ్రామస్థుల సహాయంతో శవాన్ని బావిలోంచి బయటకు తీశారు. తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ గౌస్‌ మాట్లాడుతూ నవీన్‌కు మతిస్థిమితం సరిగా లేదని, ఆయన మృతిపై ఎలాంటి అనుమానం లేదన్నారు. 

Updated Date - 2021-09-19T04:22:21+05:30 IST