రైలుకింద పడి యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-08-14T05:11:50+05:30 IST

ముద్దనూరు రైల్వేస్టేషన్‌ సమీపంలోని కొసినేపల్లి వద్ద శనివా రం రవికాంత్‌(22) రైలు కిందపడి మృతిచెందాడు.

రైలుకింద పడి యువకుడి మృతి
పట్టాలపై పడిఉన్న మృతదేహం

ముద్దనూరు, ఆగస్టు 13: ముద్దనూరు రైల్వేస్టేషన్‌ సమీపంలోని కొసినేపల్లి వద్ద శనివా రం రవికాంత్‌(22) రైలు కిందపడి మృతిచెందాడు. బంధువుల సమాచారం మేరకు వివరాల్లోకెళితే.... కొసినేపల్లి వాసి రవికాంత్‌ అనంతపురం జిల్లా కేంద్రంలోని కియాలో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మొహర్రం పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చా డు. ఆరోగ్యపరిస్థితి బాగోలేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు.

పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

రాజంపేట, ఆగస్టు13: రాజంపేట-హస్తవరంరైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు రైల్వేపోలీసులు గుర్తించారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మృతుడు ఎవరనేది తెలియడం లేదని, మృతదేహం వద్ద లభించిన గుర్తింపు కార్డుల ఆధారంగా పరిశీలిస్తే ఇతని పేరు నాగరాజు ఆచారిగా గుర్తించామన్నారు. ఇతనికి 45 ఏళ్లు ఉండవచ్చని తెలిపారు. ఇతని వద్ద దొరికిన టికెట్టు ఎర్రగుంట్ల టు రాజంపేట ఉందని, ఇతను రాజంపేట వ్యక్తిగా ఉండవచ్చని అనుమానించి దర్యాప్తు చేస్తున్నామ న్నారు. మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రి పోస్టుమార్టం గదిలో ఉంచారని, దీని పై కేసు నమోదు చేశామన్నారు. 

Updated Date - 2022-08-14T05:11:50+05:30 IST