కుటుంబానికి దూరంగా ఉంటూ జాబ్ చేస్తున్న 28ఏళ్ల కుర్రాడు.. పెంట్ హౌస్లో అద్దెకు ఉంటూ రాత్రివేళ అతడు చేసిన పనికి షాక్..
ABN , First Publish Date - 2021-12-26T00:02:17+05:30 IST
అతడికి 28ఏళ్లు. కుటుంబానికి దూరంగా ఉంటూ.. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా అతడు చేసిన పనికి స్థానికులు కంగుతిన్నారు. దీంతో ప్రస్తుతం ఆ ఘటన స్థానికంగా చర్చనీ
ఇంటర్నెట్ డెస్క్: అతడికి 28ఏళ్లు. కుటుంబానికి దూరంగా ఉంటూ.. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా అతడు చేసిన పనికి స్థానికులు కంగుతిన్నారు. దీంతో ప్రస్తుతం ఆ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
హర్యానాలోని భివాని ప్రాంతానికి చెందిన నరేంద్ర (28).. ఫతేబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే జవహార్ చౌక్ ఏరియాలో నరేంద్ర.. పెంట్ హౌస్లో అద్దెకు ఉంటున్నాడు. ఎప్పటిలాగే గురువారం రోజు కూడా పనికి వెళ్లిన అతడు.. సాయంత్రం రూమ్కు తిరిగొచ్చాడు. తర్వాత ఏమైందో ఏమో కానీ.. గురువారం రాత్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. అందరూ పడుకున్న తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లారిన తర్వాత ఎంతకూ గదిలోంచి బయటకు రాకపోవడంతో సందేహపడ్డ ఇంటి యజమానులు.. తలుపులు బద్దలు కొట్టారు. అనంతరం గదిలో నరేంద్ర విగత జీవిగా వేలాడటం చూసి నివ్వెర పోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో ఘటనా స్థలానికి చేరుకున్నా అధికారులు నరేంద్ర మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గదిలో సూసైడ్ నోట్ కూడా లభించకపోవడంతో.. నరేంద్ర మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.