రోడ్డు ప్రమాదంలో యువ దర్శకుడు మృతి
ABN , First Publish Date - 2022-08-16T07:03:05+05:30 IST
తమిళనాడులోని షోలింగరం వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువ దర్శకుడు, బంగారుపాళ్యం వాసి రవితేజ (21) మృతిచెందాడు.
బంగారుపాళ్యం, ఆగస్టు 15: తమిళనాడులోని షోలింగరం వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువ దర్శకుడు, బంగారుపాళ్యం వాసి రవితేజ (21) మృతిచెందాడు. మండలంలోని మొగిలివెంకటగిరికి చెందిన జగదీష్ కుమారుడు రవితేజ యూట్యూబ్ ఛానళ్లలో లఘుచిత్రాలు తీసి తెలంగాణ ప్రభుత్వం నుంచి పలు అవార్డులు పొందాడు. సినిమా అవకాశాల కోసం హైదరాబాదులో నివాసముంటున్నాడు. పూరి జగన్నాథ్ వంటి ప్రసిద్ధ దర్శకుల వద్ద అసిస్టెంట్గా పనిచేశాడు. కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం తమిళనాడులోని తిరుత్తణి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా వీరి కారు ప్రమాదానికి గురైంది. రవితేజ సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో వారిని వేలూరు సీఎంసీకి తరలించారు.