బురఖా ధరించి కాల్పులు.. గ్యాంగ్‌స్టర్ సోదరినంటూ..

ABN , First Publish Date - 2020-11-24T22:11:11+05:30 IST

బురఖా ధరించిన ఓ మహిళ ఉన్నట్లుండి కాల్పులకు తెగబడింది. చుట్టుపక్కల ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. తాను గ్యాంగ్‌స్టర్ చెల్లెలినని, తనతో పెట్టుకుంటే ప్రాణాలు గాల్లో...

బురఖా ధరించి కాల్పులు.. గ్యాంగ్‌స్టర్ సోదరినంటూ..

న్యూఢిల్లీ: బురఖా ధరించిన ఓ మహిళ ఉన్నట్లుండి కాల్పులకు తెగబడింది. చుట్టుపక్కల ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. తాను గ్యాంగ్‌స్టర్ చెల్లెలినని, తనతో పెట్టుకుంటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని వార్నింగ్ ఇస్తూ కాల్పులు జరిపింది. ఈ ఘటన ఢిల్లీలోని చౌహాన్ బంగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా వారికి లభించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబరు 18న చౌహన్ బంగర్ ప్రాంతంలోని ఓ దుకాణదారుతో బురఖా ధరించిన ఓ మహిళ వాగ్వాదానికి దిగింది. వెంటనే తన బ్యాగ్‌లోనుంచి గన్ తీసి అతడికి గురిపెట్టింది. ‘నాతోనే గొడవపడతావా? నీకెంత ధైర్యం? నేనెవరో తెలుసా..?’ అంటూ హడలెత్తించింది. 


భయపడిపోయిన షాపు యజమాని వెంటనే షటర్ దించేసి లోపల ఉండిపోయాడు. దీంతో ఆగ్రహించిన ఆ మహిళ తన చేతిలోని గన్‌తో మూసివేసిన షటర్‌పై కాల్పులు జరిపింది. ఒక్కసారిగా గన్ సౌండ్ వినడంతో చుట్టుపక్కల ఉన్నవారు బెంబేలెత్తిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులకు ఆమెకోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఆ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ఫుటేజీని సంపాదించి.. అందులో ఆమెను గుర్తించారు. ఆమె అదే ప్రాంతంలో నివశించే నుస్రత్‌గా గుర్తించారు.

Updated Date - 2020-11-24T22:11:11+05:30 IST