Woman Sarpanch: అక్కడ ప్రభుత్వ పాఠశాలలో చేరితే.. నెలకు రూ.500 ప్రోత్సాహకం..!

ABN , First Publish Date - 2022-06-07T02:02:09+05:30 IST

ప్రభుత్వ స్కూళ్లకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రైవేటు స్కూళ్ల వైపే తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో..

Woman Sarpanch: అక్కడ ప్రభుత్వ పాఠశాలలో చేరితే..  నెలకు రూ.500 ప్రోత్సాహకం..!

ప్రభుత్వ స్కూళ్లకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రైవేటు స్కూళ్ల వైపే తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా తగ్గిపోతోంది. దాంతో చాలాచోట్ల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి- ఇందిరానగర్ సర్పంచ్ కొడగూటి శారద తీసుకున్న నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ రెండు గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్ధులకు నెలకు 500 రూపాయల చొప్పున ప్రోత్సాహకం ఇస్తానని ప్రకటించారు. వాటితో పాటు  దుస్తులు, పుస్తకాలకు అయ్యే ఖర్చును కూడా భరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ రెండు గ్రామాల్లోని పాఠశాలల్లో ప్రస్తుతం 70 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా కనీసం మరో 50 మందిని చేర్పించాలని నిర్ణయించుకున్నట్టు సర్పంచ్ శారద తెలిపారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే రాష్ట్రమంతటా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులు చదివేలా ఇలాంటి ప్రోత్సాహకాలు ప్రకటించాలని నెటిజన్లు కోరుతున్నారు.

Updated Date - 2022-06-07T02:02:09+05:30 IST