రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN , First Publish Date - 2022-08-12T06:06:44+05:30 IST

భువనగిరి శివారులోని రాయిగిరి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి



భువనగిరి రూరల్‌, అగస్టు 11: భువనగిరి శివారులోని రాయిగిరి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. భువనగిరి రూరల్‌ ఎస్‌ఐ హెచ రాఘవేందర్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మణికొండకు చెందిన మేకల శ్రీనివాస్‌, భార్య మేకల శిరీష (23)తో కలిసి యాదగిరిగుట్టలో జరిగిన శుభకార్యానికి హాజరై స్కూటీపై హైదరాబాద్‌కు తిరిగి వెళ్తుండగా మార్గమధ్యలోని రాయిగిరి చెరువు కట్టవద్ద వెనుక నుంచి ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో శిరీషకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌ స్వల్పంగా గాయపడ్డాడు. అయితే తీవ్రంగా గాయపడిన శిరీషను చికిత్స నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందింది. శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2022-08-12T06:06:44+05:30 IST