యువకుడి ప్రాణం తీసిన.. పెళ్లి బ్యాండ్

ABN , First Publish Date - 2021-08-28T19:40:26+05:30 IST

హైదరాబాద్: బ్యాండ్ బృందాన్ని నడిపిస్తున్న యువకుడు.. అదే బ్యాండ్ కారణంగా మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. రాయదుర్గంలో జరిగిన పెళ్లికి శుక్రవారం రాత్రి నరేష్ బృందం.. బ్యాండ్ వాయించింది

యువకుడి ప్రాణం తీసిన.. పెళ్లి బ్యాండ్

హైదరాబాద్: బ్యాండ్ బృందాన్ని నడిపిస్తున్న యువకుడు.. అదే బ్యాండ్ కారణంగా మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. రాయదుర్గంలో జరిగిన పెళ్లికి శుక్రవారం రాత్రి నరేష్ బృందం.. బ్యాండ్ వాయించింది. అయితే శబ్ధకాలుష్యం ఎక్కువ అయిందని స్థానికులు.. రాయదుర్గం పోలీసులకు ఫోన్ పోశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు  వాయిద్యాన్ని నిలిపేశారు. ఈ క్రమంలో పోలీసులకు, వారికి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు నరేష్‌ను చితకబాదారని, దీంతో స్పృహ కోల్పోయి.. మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు అతను అనారోగ్య కారణాలతోనే చనిపోయారని పోలీసులు చెబుతున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2021-08-28T19:40:26+05:30 IST