సీఎం జగన్కు ఘన స్వాగతం
ABN , First Publish Date - 2022-08-17T05:42:50+05:30 IST
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో టైర్ల పరిశ్రమ ప్రారంభోత్సవానికి విశాఖ విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
గోపాలపట్నం, ఆగస్టు 1: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో టైర్ల పరిశ్రమ ప్రారంభోత్సవానికి విశాఖ విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఉదయం 10.15 గంటలకు ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు మంత్రి గుడివాడ అమర్నాథ్, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. హెలికాప్టర్లో 10.30 గంటలకు ముఖ్యమంత్రి అచ్యుతాపురం బయలుదేరి వెళ్లారు. అక్కడ కార్యక్రమం ముగిశాక మఽధ్యాహ్నం ఒంటిగంటన్నరకు తిరిగి ఆయన విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం జగన్ రోడ్డు మార్గం గుండా ‘దక్షిణ’ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్కుమార్ ఇంటికి వెళ్లి మళ్లీ మధ్యాహ్నం 2.15 గంటలకు ఎయిర్పోర్టుకు చేరుకుని రెండున్నరకు గన్నవరం బయలుదేరి వెళ్లారు.